లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సమావేశానికి సీపీఐ(మావోయిస్టు) బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో బీఎస్ఎఫ్, డీఆర్జీ, రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు.