సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో వైసీపీ అభాసుపాలైందని చంద్రబాబు విమర్శించారు. "ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు చేస్తోంది. బొండా ఉమను ఇరికించే కుట్ర చేస్తున్నారు. సీఎంపై హత్యాయత్నం అంటూ టీడీపీపై బురద చల్లాలని చూస్తున్నారు. వైసీపీ ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారు. నాలుగు రోజులైనా ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదు." అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.