తాజాగా ఇరాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెష్కియన్ విజయ సాధించారు. ఇస్లామిస్ట్ వాది అయిన సయీద్ జలీలిపై గెలుపొందడంతో మసూద్ పాలన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పోలింగ్లో పెజెష్కియన్కు 1.63 కోట్ల ఓట్లు రాగా సయీద్కు 1.35 కోట్ల ఓట్లు వచ్చాయి. మూడు కోట్ల మంది పోలింగ్లో పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా మసూద్ ఎన్నికతో ఇరాన్లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.