బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రిగా మాయావతి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం లక్నో పార్టీ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో బీఎస్పీసెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సిఇసి) నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ విషయాన్ని పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలతో పార్టీ ఎలాంటి నిరాశ చెందలేదని తెలిపింది.