మెదక్ నియోజకవర్గం చిన్న శంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తాలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు చెన్నాయిపల్లికి చెందిన సాయన్నల నర్సింలుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.