ప్రధాని మోడీని చంపేస్తానన్న వ్యక్తిపై కేసు

323136చూసినవారు
ప్రధాని మోడీని చంపేస్తానన్న వ్యక్తిపై కేసు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు అయింది. మహమ్మద్ రసూల్ కద్దారే అనే వ్యక్తి హైదరాబాద్‌లో దినసరి కూలీ. చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని ప్రధానిని, యూపీ సీఎంను చంపేస్తానన్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అతడిపై కర్ణాటకలోని యాదగిరిలోని సుర్పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్