మెదక్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బట్టికాడి రాజుగౌడ్(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో పురుగుల మందు తాగినట్లు సమాచారం. చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందాడు.