తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రేపు (శనివారం) కీలకమైన సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఇవే అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూల్లోని సంస్థలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆర్థికపరమైన, ఉద్యోగుల అంశాలపైనా చర్చించే అవకాశం ఉందట. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలపై చర్చ, ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలనే అంశంపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.