ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి మాజీ సీఎం జగన్ ద్రోహం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసి చంద్రబాబు లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని తెలిపారు. జలవనరుల శాఖ సమర్థంగా నిర్వర్తించి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. జగన్ అసమర్థతతో కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందని దుయ్యబట్టారు.