వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు

80767చూసినవారు
వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్ గూడ్స్ కేసులో విచారణకు రావాలని హర్షకి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు పంపించారు. ముబిన్ అనే స్మగ్లర్ హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్ లు తెచ్చినట్లు సమాచారం. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ లగ్జరీ వాచ్ లను హర్ష ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ముబిన్ నుంచి రెండు వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాచ్ రూ.1.75 కోట్లు ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్