సిద్ధిపేట జిల్లాలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి పొన్నం కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహామండపంలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ సస్యశ్యామలం కావాలని మల్లన్నను వేడుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.