హైదరాబాద్ లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.25 వేలు సాయం అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితురాలికి సీతక్క భరోసా ఇచ్చారు. ఈ మేరకు నాగర్కర్నూల్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈశ్వరమ్మపై దాడి కేసు పురోగతి తెలుసుకున్నారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.