ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కస్టడీకి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఈ సందర్భంగా జరిగిన విచారణకు కేజ్రీవాల్ హాజరయ్యారు. విచారణ అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది.