సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఐటీఐలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి మొత్తం 295 ఐటీఐలు ఉన్నాయి. ఐటీఐలలో విద్యార్థులకు 32 కోర్సులు ఉన్నాయి. 6 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. హుజుర్నగర్లో రూ.కోటి నిధులతో మినీ స్టేడియం నిర్మిస్తాం' అని అన్నారు.