నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు (వీడియో)

76చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధార‌ణ పౌరుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వ‌ర్షాల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌ప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న ప‌లువురు ఎంపీల నివాసాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుప‌క్క‌ల నీరు నిలిచిపోయింది. త‌న ఇల్లు వ‌ర్ష‌పు నీటితో నిండిపోయిన‌ట్లు కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ పేర్కొన్నారు. ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది.

సంబంధిత పోస్ట్