దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. దక్షిణ ఢిల్లీలో గోవిందపురి ప్రాంతంలో వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. తీన్మూర్తి మార్గంలో కూడా వరద నీరు భారీ స్థాయిలో చేరింది. మింటో రోడ్డులో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. సింధోరా కలాన్ విలేజ్ అండర్ పాస్ వద్ద నీటిలో బస్సు చిక్కుకుంది. తిలక్ బ్రిడ్జ్ అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోయింది. నరైనా నుంచి మోతీబాగ్ వెళ్లే రహదారిలో వరద నీటిలో కారు చిక్కుకుంది.