ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్లు NDTV తెలిపింది. దాంతో పాటు స్పీకర్ పదవి, రెండు కేబినెట్ బెర్తులు అడుగుతోందని వెల్లడించింది. అటు జేడీయూ రైల్వేతో పాటు వ్యవసాయశాఖను కోరుతున్నట్లు సమాచారం. ఇక హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల లాంటి కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీనే అట్టిపెట్టుకుంటుందని NDTV వివరించింది.