రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న వివేకానంద్ మొబైల్ కీలకంగా మారనుంది. వివేకానంద్కు డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ బాక్రీ పది సార్లు కొకైన్ సప్లై చేసినట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరితో కలిసి డ్రగ్ పార్టీలు చేసుకున్నాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మొబైల్ ఫోన్లో కాల్డేటా, మెస్సేజీలు, వాట్సాప్ చాట్ను రిట్రైవ్ చేయించాలని నిర్ణయించారు.