నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ శనివారం మండిపడ్డారు. దీనిపై ట్వీట్ చేశారు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ప్రజలు రెట్టింపు భారాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. బంగాళదుంపలు, ఉల్లి, టమోటాలు, కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదల రికార్డు స్థాయిలో ఉందని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు.