ప్రధాని మోదీ మానసికంగా బలహీనమైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన తెగ ఇబ్బందిపడుతారని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విద్యార్థుల గురించి ఆందోళన చెందడం లేదని అన్నారు. నోట్ల రద్దుతో ఎలా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారో, ఇప్పుడు విద్యా వ్యవస్థలో అదే జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.