ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారని, కానీ ఏనాడూ దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదు. మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉంది’ అని వ్యాఖ్యానించారు.