గుజరాత్‌లో వినాయకుడి నిమజ్జనంలో అపశృతి, స్పందించిన మోదీ

64చూసినవారు
గుజరాత్‌లో వినాయకుడి నిమజ్జనంలో అపశృతి, స్పందించిన మోదీ
గుజరాత్‌లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గాంధీనగర్‌లోని మెష్వా నదిలో గణేశుడి నిమజ్జనం అనంతరం ఈత కొడుతూ ఓ యువకుడు నీటిలో మునిగిపోయాడు. దీంతో అతడ్ని కాపాడే క్రమంలో ఒకరి తర్వాత మరొకరు నదిలోకి వెళ్లి అందరూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. మెష్వా నదిలో మునిగి 8 మంది చనిపోవటం బాధాకరమని ట్వీట్ చేశారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్