జెత్వానీలో కేసులో ఇద్దరు పోలీసులపై వేటు

53చూసినవారు
జెత్వానీలో కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని డీల్ చేసిన అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం. సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైనా చర్యలు తీసుకుంటారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్