కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ సవాల్ విసిరారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబోమని కాంగ్రెస్ ప్రకటించగలదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంతో చెలగాటమాడబోమని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించమని కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ పార్టీ యువరాజు కానీ ప్రకటించే సాహసం చేస్తారా అని తాను సవాల్ చేస్తున్నానని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రకటించే ధైర్యం చేయదని అన్నారు.