మోదీజీ.. నాకే ఫోన్ చేయొచ్చుగా: ఒడిశా సీఎం

70చూసినవారు
మోదీజీ.. నాకే ఫోన్ చేయొచ్చుగా: ఒడిశా సీఎం
తన ఆరోగ్యంపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఒడిశా సీఎం పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నెలరోజులుగా నేను రాష్ట్రమంతటా ప్రచారంలో తిరుగుతూ బాగానే ఉన్నా. నేను మంచి మిత్రుడినని మోదీ అన్నారు. మరి అలాంటప్పుడు నాకే ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి కనుక్కోవచ్చుగా’ అని ప్రశ్నించారు. నవీన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంపై అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయిస్తామని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్