దక్షిణాదిలో రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నా ఉత్తరాది ప్రాంతం మాత్రం ఇంకా భానుడి భగభగలకు భగ్గుమంటోంది. దీంతో మనుషులే కాదు.. జంతువులు సైతం అల్లాడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వానరం వడదెబ్బకు గురైంది. అయితే దీంతో కొందరు వ్యక్తులు దాని వీపుపై చల్లటి నీరు పోసి ఒళ్లంతా నిమరారు. దీంతో అది కొంచెం కోలుకొని లేచి కూర్చుంది. అనంతరం మరో వ్యక్తి వానరానికి ఓఆర్ఎస్ను తాగించాడు.