పెట్రోల్, డీజిల్ వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువ అవుతుందని ఎలక్ట్రిక్ వాహనాలను కనిపెట్టారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ‘ఎమిషన్ అనలటిక్స్'అనే సంస్థ రెండు రకాల కార్లలోని బ్రేకింగ్, టైర్ల నుంచి విడుదలయ్యే కాలుష్యంపై అధ్యయనం జరిపింది. ఈవీల తయారీ, ఛార్జింగ్ కోసం ఉత్పత్తి చేసే విద్యుత్ వల్ల ఎక్కువ ఉద్గారాలు విడుదలవుతున్నాయని నివేదికలో పేర్కొనడం జరిగింది.