కన్నతల్లి, ఇద్దరు పిల్లల్ని చంపిన తండ్రి

26883చూసినవారు
కన్నతల్లిని, తన ఇద్దరు పిల్లల్ని ఓ కసాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో జరిగింది. పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి పిట్టల పిచ్చమ్మ (60), అతని ఇద్దరి కూతుళ్లు పిట్టల నీరజ (10), పిట్టల ఝాన్సీ (6)లను ఈ రోజు తెల్లవారు జామున చంపి పరారయ్యాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా రెండేళ్ల క్రితం భార్యను కూడా చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్