మధ్యప్రదేశ్లో ఓ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వినూత్నంగా నిరసన తెలిపారు. ఉజ్జయిని లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మహేశ్ పర్మార్ బరిలో ఉన్నారు. అక్కడ ఎంతో ప్రముఖమైన షిప్రా నది పరిశ్రమలు, పట్టణాల నుంచి వచ్చే వ్యర్థాలతో కలుషితం అవుతోంది. అధికార బీజేపీకి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మమేశ్ పర్మార్ తొలుత కలుషిత నీరు వస్తున్న కాలువలో కూర్చున్నారు. అనంతరం నదిలోకి దిగి స్నానం చేసి ప్రభుత్వానికి నిరసనను తెలియజేశారు.