బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ NDA అభ్యర్థిగా ఎం.ఎం కొండయ్య గురువారం నామినేషన్ వేశారు. నామినేషన్ నేపథ్యంలో చీరాల మండలం హస్తినాపురం నుంచి చీరాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో
టీడీపీ నేత, సినీ నటుడు నిఖిల్ సిద్దార్థ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ..
చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు.