యూపీపై ఎంపీ శ‌శిథ‌రూర్ పోస్టు.. బీజేపీ లీడ‌ర్ల ఫైర్

72చూసినవారు
యూపీపై ఎంపీ శ‌శిథ‌రూర్ పోస్టు.. బీజేపీ లీడ‌ర్ల ఫైర్
పోటీ ప‌రీక్ష‌ల పేప‌ర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ త‌న సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్ప‌ద‌మైంది. దీంతో బీజేపీ నేత‌లు ఎంపీ శ‌శిథ‌రూర్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రాల‌పై ఎప్పుడూ కామెంట్ చేసే ఎంపీ శ‌శి ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను టార్గెట్ చేశార‌ని సీఎం బిశ్వ‌శ‌ర్మ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ కూడా రియాక్ట్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్