పోటీ పరీక్షల పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. దీంతో బీజేపీ నేతలు ఎంపీ శశిథరూర్పై విమర్శలు చేస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రాలపై ఎప్పుడూ కామెంట్ చేసే ఎంపీ శశి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను టార్గెట్ చేశారని సీఎం బిశ్వశర్మ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా రియాక్ట్ అయ్యారు.