ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే (47) న్యూయార్క్లో సోమవారం గుండెపోటుతో మరణించారు. న్యూయార్క్ వేదికగా జరిగిన భారత్(India), పాకిస్థాన్ మ్యాచ్ను స్నేహితులతో కలిసి మస్త్ ఎంజాయ్ చేసిన ఆయన ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. దాంతో, టీమిండియా విజయాన్ని ఆస్వాదించిన అమోల్ మృత్యు ఒడికి చేరడంతో ముంబై క్రికెట్లో విషాదం నెలకొంది.