మాజీ ఎంపీటీసీ హత్య.. కారుతో సహా పూడ్చి పెట్టారు

61చూసినవారు
మాజీ ఎంపీటీసీ హత్య.. కారుతో సహా పూడ్చి పెట్టారు
హైదరాబాద్ ఘట్కేసర్ లో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ (40) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 17న బయటకు వెళ్లిన మహేష్ తిరిగి ఇంటికి రాలేదు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ ఎన్‌ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహాన్ని గుర్తించారు. దుండగులు హత్య చేసి కారుతో సహా పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్నవారిని కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్