'ఇండియాలో ముస్లింలు బాధ పడుతున్నారు'.. ఇరాన్ సుప్రీం లీడర్ వ్యాఖ్యలను ఖండించిన భారత్

72చూసినవారు
'ఇండియాలో ముస్లింలు బాధ పడుతున్నారు'.. ఇరాన్ సుప్రీం లీడర్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
భారత దేశంలో ముస్లింల పరిస్థితిపై ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. 'మయన్మార్, గాజా, భారత్ లో ముస్లింలు బాధ పడుతున్నారు' అని అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. "మైనారిటీలపై మాట్లాడే దేశాలు ఇతరులపై ఏవైనా వ్యాఖ్యలు చేయడానికి ముందు వారి సొంత రికార్డును పరిశీలించుకోవాలి" అని భారత్ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్