నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి

57చూసినవారు
నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి
గురుకుల పాఠశాలలకు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దేవరకొండలో జరిగిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో నాణ్యత కొరవడిందని, నాసిరకం బియ్యం వల్ల విద్యార్థులు తీవ్ర అనారోగ్యనికి గురవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఇతర నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్