మాజీ ఎమ్మెల్యే నల్లమోతు ఆధ్వర్యంలో రైతు భరోసా నిరసన దీక్ష

71చూసినవారు
మాజీ ఎమ్మెల్యే నల్లమోతు ఆధ్వర్యంలో రైతు భరోసా నిరసన దీక్ష
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గస్థాయి రైతు భరోసా నిరసన దీక్షను చేపట్టారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు క్వింటాలు వడ్లకు రూ. 500 బోనస్, ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం, రైతు రుణమాఫీ, రైతుబంధు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్