డి.ఎస్.పి ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

368చూసినవారు
భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్ ను అవమానించిన సీఎం కేసీఆర్ చేసిన మాటలను ఖండిస్తూ, మర్రిగూడ మండలం దళిత శక్తి ప్రోగ్రాం అధ్యక్షులు నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో గురువారం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అంబేద్కర్ పూలమాలవేసి, క్యాండిల్స్ తో దీపారాధన, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను మహారాజ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని, భారత రాజ్యాంగం వల్లనే ఈ దేశంలో ఉన్న వంద కోట్ల జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , వారికి ఫలాలు అందుతున్నాయి, అలాంటి రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన మాటలను ఖండిస్తూ తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల కో ఆర్డినేటర్ లింగయాన్ మహారాజ్, మర్రిగూడ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సంజీవ, ఉపాధ్యక్షులు మారయ్య, వినోద్, కార్యదర్శులు దివాకర్, కొండల్, రాజు, సురేష్, నరసింహ, లక్ష్మణ్, చంద్రయ్య, ప్రభాకర్ , వెంకటేష్, మహేష్, కృష్ణ, మురళి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్