పెండింగ్‌లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

51చూసినవారు
పెండింగ్‌లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం గ్రామ శాఖ మహాసభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. వారు మాట్లాడాతు మండలంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల, గుండ్రాంపల్లి గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటమే కాకుండా వట్టిమర్తిలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్