ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్కెట్ పల్లి మండలం దాసరిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొలగోని యోగిత్కి ప్రవళికతో ఆరు నెలల కిందటే వివాహమైంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రవళిక ఇంటికి రావడంతో మనస్తాపం చెందిన యోగిత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.