కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 24న రద్దు చేసినట్లు కలెక్టర్ సి. నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తనతో సహా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు సోమవారం రోజున మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతున్నందున కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలకు ఉంటుందన్నారు.