భారత్లో పెరుగుతున్న జనాభాపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. MNNIT అలహాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు తగినంత శ్రద్ధ చూపలేదని, ఇది దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగిస్తుందని అన్నారు. అమెరికా, బ్రెజిల్, చైనాలతో పోలిస్తే భారత్లో తలసరి భూమి లభ్యత చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.