కుక్కలతో జనం బెంబేలు
తొర్రూరు పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పలు కాలనీలలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ దాడి చేస్తున్నాయి. మహిళలు, చిన్నపిల్లలు రాత్రిళ్లు బయటకు రావాలంటే జంకుతున్నారు. స్థానిక అంబేడ్కర్ కాలనీలో గత కొన్నిరోజుల క్రితం మంగళంపల్లి వెంకటేష్ కు చెందిన గొర్రెపిల్లపై కుక్కలు తీవ్రంగా దాడిచేసి చంపేశాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని శనివారం విజ్ఞప్తి చేస్తున్నారు.