నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ అజిత్ పవార్ సోమవారం లోక్సభ ఎన్నికల కోసం ముంబైలో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. కుల ఆధారిత జనాభా గణన డిమాండ్కు మద్దతు ఇస్తామని ఆయన హామీనిచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం యశ్వంతరావ్ చవాన్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలన్నారు.