రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.5,337 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,716 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 3 శాతం మేర పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.20,466 కోట్ల నికర లాభం వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటనరీ ఫైలింగ్లో పేర్కొంది.