మార్చి 3న నిర్వహించాల్సిన
నీట్ పీజీ పరీక్షను జులై 7కు వాయిదా వేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డు ప్రకటించింది. పరీక్షను రీ షెడ్యూల్ చేస్తున్నట్లుగా మంగళవారం ప్రకటించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని ఆగస్ట్ 15గా నిర్ణయించారు. పీజీ వైద్య నిబంధనల ప్రకారం పరీక్షను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.