నీట్‌ పేపర్‌ లీక్‌.. నలుగురు MBBS విద్యార్థుల అరెస్టు

50చూసినవారు
నీట్‌ పేపర్‌ లీక్‌.. నలుగురు MBBS విద్యార్థుల అరెస్టు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) ముమ్మరంగా దర్యాప్తు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థుల్ని సీబీఐ అరెస్ట్‌ చేసింది. విద్యార్థులు పాట్నాలోని ఎయిమ్స్‌కు చెందినవారని సీబీఐ తెలిపింది. ఈ నలుగురి అరెస్ట్‌తో నీట్‌ పరీక్ష లీకేజీ, మోసం, ఇతర అవకతవకలకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరింది.

సంబంధిత పోస్ట్