వైద్యుల నిర్లక్ష్యం.. చేతికి బదులు నాలుకకు సర్జరీ

67చూసినవారు
వైద్యుల నిర్లక్ష్యం.. చేతికి బదులు నాలుకకు సర్జరీ
కేరళలో వైద్యుల నిర్లక్ష్యం..ఒకరి చేతికి చేయాల్సిన సర్జరీని మరొకరి నాలుకకు చేశారు. చేతికి ఉన్న ఆరో వేలు తొలగింపు కోసం నాలుగేళ్ల చిన్నారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. సర్జరీ తర్వాత చిన్నారి నోటికి ప్లాస్టర్ చూసి ఆశ్చర్య పోయిన తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించారు. దాంతో మరో పాపకు చేయాల్సిన సర్జరీ ఈ చిన్నారికి చేశామని, పొరపాటు జరిగిందని వైద్యులు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్