లక్షద్వీప్ను భారతదేశంలోని ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు మినికాయ్ దీవుల్లో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని
భారత్ యోచిస్తోంది. ఈ ఎయిర్పోర్ట్ ఫైటర్ జెట్లు, సైనిక రవాణా విమానాలు, వాణిజ్య విమానాలను ఆపరేట్ చేయగల ఉమ్మడి ఎయిర్ఫీల్డ్ను కలిగి ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.