రామమందిరంలో పనిచేసే పూజారులకు కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆలయ పూజారులు ఇక నుంచి తెల్లటి ధోతీలు, పసుపు చౌబందీ (కుర్తా)లో కనిపించనున్నారు. వీటిని పూజారులకు రామమందిర్ ట్రస్ట్ అందజేస్తుంది. డ్రెస్ కోడ్తో పాటు, రామ్లల్లాకు పూజలు చేసే మొత్తం 25 మంది పూజారులకు రామ్ మందిర్ ట్రస్ట్ కీప్యాడ్ ఫోన్లను జారీ చేసింది. ఆలయ ప్రాంగణంలో ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.