ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచింది. ఐదు పాయింట్లతో గ్రూప్-B టాపర్గా సౌతాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు న్యూజిలాండ్ సెమీస్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. మార్చి 5న న్యూజిలాండ్-సౌతాఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.